తనపై తనకు విశ్వాసమున్న సారథి భారత్కు అవసరమని విరాట్ కోహ్లీ అలాంటివాడేనని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. అతడి ఆటలో అభిరుచి, దూకుడు, బాధ్యత కలగలిసి ఉన్నాయని వెల్లడించారు.
‘ఇప్పుడు భారత్ 300 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదిస్తోందంటే జట్టు విరాట్ కోహ్లీపై ఆధారపడుతుందని అర్థం. గణాంకాల గురించి మాట్లాడితే విరాట్ ఛేదనలో 24 శతకాలు చేయగా అందులో 21 సార్లు భారత్ గెలిచింది. అనురక్తి, దూకుడు, బాధ్యతల అద్భుత మేలిమి కలయిక విరాట్’ అని శ్రీకాంత్ అన్నారు.
దేశానికి తనను తాను నమ్మే, జట్టుపై విశ్వాసం ఉండే సారథి అవసరమని శ్రీకాంత్ నొక్కి చెప్పారు. ఇంతకుముందు కపిల్ అలా ఉన్నారని ఇప్పుడు యువకుల కోసం విరాట్ కోహ్లీ అలా ఉన్నాడని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా విరాట్ కోహ్లీ నిలకడగా పరుగుల వరద పారిస్తున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో అతడు శతకం చేయడంతోనే భారత్ను విజయం వరించింది.
‘ఇప్పుడు భారత్ 300 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదిస్తోందంటే జట్టు విరాట్ కోహ్లీపై ఆధారపడుతుందని అర్థం. గణాంకాల గురించి మాట్లాడితే విరాట్ ఛేదనలో 24 శతకాలు చేయగా అందులో 21 సార్లు భారత్ గెలిచింది. అనురక్తి, దూకుడు, బాధ్యతల అద్భుత మేలిమి కలయిక విరాట్’ అని శ్రీకాంత్ అన్నారు.
దేశానికి తనను తాను నమ్మే, జట్టుపై విశ్వాసం ఉండే సారథి అవసరమని శ్రీకాంత్ నొక్కి చెప్పారు. ఇంతకుముందు కపిల్ అలా ఉన్నారని ఇప్పుడు యువకుల కోసం విరాట్ కోహ్లీ అలా ఉన్నాడని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా విరాట్ కోహ్లీ నిలకడగా పరుగుల వరద పారిస్తున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో అతడు శతకం చేయడంతోనే భారత్ను విజయం వరించింది.
